'నిందిస్తూనే ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపేలా ఉన్నారు'

12 Mar, 2015 15:34 IST|Sakshi

హైదరాబాద్:టీడీపీ ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ను నిందించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతోందని విమర్శించారు. ఇలా కాంగ్రెస్ పార్టీని నిందిస్తూనే ప్రభుత్వాన్ని నడిపేలా ఉన్నారని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.

 

14 వ ఆర్థిక సంఘాన్ని నిందించారని.. కేంద్రం నుంచి నిధులు రాబడితే ఇబ్బందులు వచ్చేవి కావన్నారు. ఊహాలోకాల్లో నామమాత్రపు బడ్జెట్ ను ప్రవేశపెట్టారని రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు.

మరిన్ని వార్తలు