హైదరాబాద్: ఆంధప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూసేకరణ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమైంది.
మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిశోర్ బాబుతో పాటు రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ల్యాండ్ పూలింగ్పై చర్చించారు. సీఆర్డీఏ బిల్లులో న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. రైతులకిచ్చే భూ యాజమాన్య సర్టిఫికెట్లపై న్యాయసలహా తీసుకోవాలని ఈ భేటీలో నిర్ణయించారు.