-
శ్రీకాకుళం: ఆంధ్ర-ఒడిషా సరిహద్దులో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాలిలా ఉన్నాయి... ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని శ్రీకాకుళం జిల్లాలో కారు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం వెంటనే బరంపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి పొగమంచే కారణమయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.