కారు బీభత్సం, నలుగురు దుర్మరణం

20 Jun, 2014 08:35 IST|Sakshi

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. లావేరు మండలం బుడుమూరు వద్ద ఈరోజు ఉదయం ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పాదచారులపైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు