అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంతపురంలోని కేఎస్ఆర్ పాఠశాలలో శుక్రవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పరీక్షలను పరిశీలించేందుకు గిరిజన సంక్షేమ శాఖ అధికారి కొండలరావు వచ్చారు. పరీక్షలను పరిశీలించిన అనంతరం బయటకు వెళ్లేందుకు బడి తీయగా ముందుకు కదలలేదు. దీంతో అక్కడ విద్యార్థుల వెంట వచ్చిన పిల్లల సాయం తీసుకున్నారు. కండీషన్ సరిగా లేని ఈ వాహనం తరచూ మొరాయిస్తోంది. పరీక్ష కేంద్రం వద్ద పిల్లలు కొంతదూరం తోశాక వాహనం ముందుకు కదిలింది.