శునకంతో మార్జాలం.. అహో ఇంద్రజాలం

16 Jul, 2019 07:37 IST|Sakshi

సాక్షి,పాలకొండ(శ్రీకాకుళం) : శునకం.. మార్జాలం పుట్టుకతోనే శత్రువులు. సాధారణంగా కుక్కలకు పిల్లులు ఎదురుపడితే వెంటపడి మరీ తరుముతాయి. అలాంటిది పాలకొండ మండలం యరకారాయపురం గ్రామానికి చెందిన బొత్స బావాజీ నాయుడు ఆరు నెలల కిందట తెచ్చుకున్న శునకం ఓ పిల్లితో నేస్తరికం కట్టుకుంది. మనిషిని సాటి మనిషే ద్వేషించుకుంటున్న ఈ సమాజంలో జంతువులై ఉండి, జాతి వైరాన్ని మరచి స్నేహాన్ని చాటడం అక్కడి గ్రామస్తులను ఆకట్టుకుంటోంది.

మరిన్ని వార్తలు