ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు పోటీలు

28 Dec, 2015 12:12 IST|Sakshi

గుంటూరు జిల్లా గురజాలలో రెండో రోజు ఎడ్ల బండలాగుడు బలప్రదర్శన పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. స్థానిక పాతపాటేశ్వరి ఆలయం 417వ తిరునాళ్ల సందర్భంగా గ్రామ రైతు కమిటీ ఈ పోటీలను నిర్వహిస్తోంది. సోమవారం జరుగుతున్న వ్యవసాయ విభాగం 6 పళ్ల ఎడ్ల జతల పోటీలకు పెద్ద సంఖ్యలో రైతులు తమ ఎడ్లతో తరలివచ్చారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా రామకృష్ణ ప్రసాద్, మోహన్‌రావు వ్యవహరిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు