వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత

28 Apr, 2017 13:07 IST|Sakshi
వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌​ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్థ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. సీబీఐ చూపిన ఆధారాలతో బెయిల్‌ రద్దు చేయలేమని కోర్టు పేర్కొంది. వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చింది.

మరిన్ని వార్తలు