ఆధారాలుంటే.. గో ఎహెడ్!

16 Jun, 2015 16:03 IST|Sakshi

ఓటుకు కోట్లు కేసులో తగిన ఆధారాలుంటే 'గో ఎహెడ్' అంటూ కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ ఏసీబీకి సమాచారం వచ్చిందని చెబుతున్నారు. కేంద్రం నుంచి ఆమోదముద్ర రావడంతో ఏసీబీ కూడా తన విచారణలో వేగాన్ని పెంచింది. చంద్రబాబు తదితరులకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం ఇప్పటికే గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులకు కూడా సమాచారం అందించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు