'పోలవరం సమస్యలు పరిష్కరించాలని చెప్పాం'

6 Dec, 2016 01:51 IST|Sakshi
'పోలవరం సమస్యలు పరిష్కరించాలని చెప్పాం'

రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి బల్యాన్ వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: పోలవరం నిర్వాసితుల సమస్యలను తగు రీతిలో పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని కేంద్ర జలవనరుల, నదుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ బల్యాన్ వెల్లడించారు.

ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమకు (కేంద్రానికి) అనేక ఫిర్యాదులు, వినతులు అందాయని అయితే సహాయ, పునరావాస చర్యలు చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కనుక వాటన్నింటినీ తగు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు