'చంద్రబాబు కన్‌ఫ్యూజన్‌ లో ఉన్నారు'

6 Jul, 2014 16:20 IST|Sakshi
'చంద్రబాబు కన్‌ఫ్యూజన్‌ లో ఉన్నారు'

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్‌ఫ్యూజన్‌ లో ఉన్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే ప్రతీ ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన బాబు.. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేస్తున్నారని మండిపడ్డారు.  ప్రస్తుతం కన్‌ఫ్యూజన్‌ లో ఉన్న చంద్రబాబు.. ప్రజలను కూడా కన్‌ఫ్యూజన్‌ కు గురిచేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.  ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికల్లో టీడీపీ అనుసరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.

 

టీడీపీ తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లను బెదిరించడం టీడీపీకి సమంజసమా?అని ప్రశ్నించారు. అనంతపురం జడ్పీ చైర్మన్ గా చమన్ ను ఎంపిక చేయడం ద్వారా రాష్ట్రాన్ని రౌడీయిజంగా తయారు చేయాలని అనుకుంటున్నారా?అని నిలదీశారు. ఇదే అంశంపై సోమవారం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్ ను కలుస్తామన్నారు. బాబు పాలనను.. ప్రజలు, ప్రకృతి కూడా అసహ్యించుకుంటున్నాయన్నారు. ప్రజల తరుపున పోరాడటానికి వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ముందుంటుందని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు