డిజిటలైజేషన్‌ గడువు పెంపుకు బాబు లేఖ

30 Mar, 2017 20:07 IST|Sakshi

అమరావతి : కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గడువు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గడువు రేపటితో ముగియనుంది. గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించాలని లేఖలో చంద్రబాబు నాయుడు కోరారు. డిసెంబర్ 31 నాటికి ఏపీ ఫైబర్ ప్రాజెక్టు పూర్తవుతుందని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.  ఏపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ద్వారా కేబుల్ ప్రసారాలను ప్రజలకు చేరువ చేయాలన్న ఆలోచనలో ఉంది.

>
మరిన్ని వార్తలు