వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసహనం

18 Dec, 2015 15:48 IST|Sakshi
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసహనం

హైదరాబాద్: 'కాల్ మనీ' వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ పై పట్టుబట్టిన ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు పారేసుకుంటే మంచిది కాదని వైఎస్సార్ సీపీ సభ్యుల్ని హెచ్చరించారు. నోరుందని మాట్లాడితే ఇక్కడ కుదరదంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ పై చంద్రబాబు తన అసహనం వ్యక్తం చేశారు. వీళ్లు ఎమ్మెల్యేలా.. బజారు రౌడీల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ సహనాన్ని కోల్పోయి మాట్లాడారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో కొన్ని...

* పది మంది డౌన్..డౌన్ అంటే మేము భయపడాలా

* నోరు పారేసుకుంటే మంచిది కాదు

* నోరుందని  మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి

* వీళ్లు ఎమ్మెల్యేలా.. బజారు రౌడీల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు


* కాల్ మనీలో ఇన్వాల్వ్ అయ్యింది మీ వాళ్లే

* హుందాగా రమ్మనండి.. నేను చెబుతా

* ఎవర్నీ వదిలిపెట్టం.. అది మా పార్టీ కావొచ్చు.. వైఎస్సార్ సీపీ కావొచ్చు

* వైఎస్సార్ సీపీ సభ్యులు రెచ్చగొడుతున్నారు

* సభలో డిక్టేట్ చేయాలని చూస్తే అది మీ వల్ల కాదు

* రెండు సార్లు ప్రతిపక్షనాయకునిగా ఉన్నా..మీరు వచ్చింది ఎప్పుడు?

మరిన్ని వార్తలు