బాబు యాత్రను ఆత్మాహుతి యాత్రగా మార్చాలి

21 Aug, 2013 17:55 IST|Sakshi

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆత్మగౌరవ యాత్ర చేపట్టడం హాస్యాస్పదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. చంద్రబాబు తన ఆత్మగౌరవ యాత్ర పేరును ఆత్మాహుతి యాత్రగా మార్చుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి జైలు నుంచి విడుదల కాకుండా అడ్డుకుంటున్న ప్రధాన వ్యక్తి చంద్రబాబేనని భూమన ఆరోపించారు. వైఎస్‌ఆర్ సీపీకి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక సోనియాతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని, రాష్ట్ర విభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు