నెల రోజుల్లోనే ఉత్తీర్ణులమయ్యాం..!

8 Dec, 2016 02:05 IST|Sakshi
నెల రోజుల్లోనే ఉత్తీర్ణులమయ్యాం..!

- నగదు రహిత రాష్ట్రంపై చంద్రబాబు వ్యాఖ్య
- బ్యాంకర్లు, ఆర్థిక శాఖాధికారులతో టెలీ కాన్ఫరెన్స్

 సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత నెలరోజులకే రాష్ట్రాన్ని నగదు రహితంగా మార్చడంలో ఉత్తీర్ణులమయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. భౌతిక నగదు వినియోగం తగ్గించి, డిజిటల్ నగదు వాడకం పెంచడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారమని అన్నారు.  పెద్దనోట్ల రద్దు సమస్య నేపథ్యంలో ఈ నెల మొదటి వారాన్ని విజయవంతంగా ముగించామని, మిగతా రోజులు కూడా ఇదే స్ఫూర్తితో పని చేసి సమస్యను అధిగమించాలని చెప్పారు.

బుధవారం తన నివాసం నుంచి బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్‌‌స నిర్వహించారు. బ్యాంకు కరస్పాండెంట్లు, పంచారుుతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను డిజిటల్ లిటరసీపై చైతన్య పరిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు