జూన్కల్లా స్వచ్ఛభారత్పై కేంద్రానికి నివేదిక

30 Apr, 2015 14:19 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ను పటిష్ఠంగా అమలు చేసేందుకు కచ్చితమైన విధానాలన్నింటినీ అధ్యయనం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన గురువారం నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ జూన్ నెలాఖరుకల్లా స్వచ్ఛభారత్ పై కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు. జపాన్ పారిశ్రామికవేత్తలు  ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు