రుణమాఫీ కోసం రణం

18 Sep, 2014 00:52 IST|Sakshi
రుణమాఫీ కోసం రణం

 వ్యవసాయ, డ్వాక్రా రుణాలను తక్షణమే మాఫీ చేయూలంటూ రైతులు, మహిళలు ధర్నాలు, ప్రదర్శనలు, రాస్తారోకోలతో రణం సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు గడచినా రుణాలు మాఫీ చేయకపోవడంపై ప్రతిచోటా నిరసనలు వెల్లువెత్తుతున్నారుు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయూలంటూ పెంటపాడుకు చెందిన మహిళలు బుధవారం ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించి తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రైతులు తీసుకున్న అన్నిరకాల రుణాలను షరతులు లేకుండా తక్షణమే మాఫీ చేయూలంటూ భీమడోలు మండలం పూళ్లకు చెందిన రైతులు యూనియన్ బ్యాంక్ ఎదుట, నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం రైతులు సహకార సంఘం ఎదుట బుధవారం ధర్నాలు నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు