చంద్రబాబు ప్రజలను వంచించారు

11 Apr, 2018 10:32 IST|Sakshi
ఎర్రగుంట్ల బైపాస్‌ రోడ్డు దిగ్బంధన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

గంట పాటు రోడ్ల దిగ్బంధం 

ప్రొద్దుటూరు : ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఇన్నాళ్లు తన పబ్బం గడుపుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచించారని వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్‌ అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎర్రగుంట్ల బైపాస్‌ రోడ్డులో రోడ్ల దిగ్బంధనం కార్యక్రమం చేపట్టారు. గంట పాటు జరిగిన ఈ కార్యక్రమంతో ఎర్రగుంట్ల బైపాస్‌ రోడ్డు, ఆర్టీపీపీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సోములవారిపల్లె గ్రామ పంచా యతీ వైఎస్సార్‌సీపీ నాయకుడు శేఖర్‌ యాదవ్, బంగారురెడ్డి, వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ వంగనూరు మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్‌ శివకుమార్‌ యాదవ్, పోసా భాస్కర్, రాజుపాళెం మండల కన్వీనర్‌ ఎస్‌ఏ నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, వెంకటేష్, జిల్లా అధికార ప్రతినిధి వెల్లాల భాస్కర్, బూసం రవి, అర్కటవేముల సిద్ధి రమణారెడ్డి, గాదెగూడూరు ఎంపీటీసీ సభ్యుడు ఎర్రి రమణారెడ్డి, తొండలదిన్నె రాజారామిరెడ్డి, చిన్నశెట్టిపల్లె సర్పంచ్‌ రామకృష్ణ యాదవ్, శంకరాపురం నాగమునిరెడ్డి.

 38వ వార్డు ఇన్‌చార్జి బద్రి రంగారెడ్డి, మార్కెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దాదాపీర్, జ్ఞానా నందం, మాజీ కౌన్సిలర్‌ మల్లికార్జున ప్రసాద్, చౌడం రవీంద్ర, ఆర్‌సీ సుబ్రహ్మణ్యం, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, నాగభూషణం, చెన్నకేశవరెడ్డి, టౌన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మనోహర్, వార్డు మెంబర్‌ సుబ్బ రాయుడు, నంద్యాల వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన్‌టౌన్‌ సీఐ వెంకటశివారెడ్డి, అర్బన్‌ సీఐ సదాశివయ్య, ఎస్‌ఐలు చంద్రశేఖర్, మధుమల్లేశ్వరరెడ్డి తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు