తిరుమల లడ్డుపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

20 Nov, 2019 21:58 IST|Sakshi

సాక్షి, అమరావతి : తిరుమల లడ్డుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన వెంకన్న లడ్డును మద్యంతో పోల్చారు. మద్యం ధరలు పెంచినట్లే తిరుమల లడ్డు పెంచుతున్నారంటూ.. ఏడుకొండల వాని ప్రసాదాన్ని దారుణంగా అవమానించారు. అమ్మకాలు తగ్గించడానికే మద్యం ధరలు పెంచుతున్నామని ప్రభుత్వం పేర్కొంది. కాగా, చంద్రబాబు వ్యాఖ్యల పట్ల వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల లడ్డును మద్యంతో పోల్చడమేంటని మండిపడుతున్నారు. 
 

మరిన్ని వార్తలు