పెట్టుబడుల కోసమే సీఎం దుబాయ్ టూర్

9 Dec, 2016 03:37 IST|Sakshi
పెట్టుబడుల కోసమే సీఎం దుబాయ్ టూర్

తిరుపతి రూరల్: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నెల 11 నుంచి 14 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తెలిపారు. గురువారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన వివరాలను తెలిపారు. ఈ బృందంలో తనతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆరుగురు ఐఏఎస్ అధికారులు ఉంటారని పేర్కొన్నారు.
 
 15న మంత్రివర్గ సమావేశం  
 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 15న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో జరగనుంది.
 

మరిన్ని వార్తలు