ప్రతి రైతుకు ఐప్యాడ్: బాబు

30 Jul, 2014 09:10 IST|Sakshi
ప్రతి రైతుకు ఐప్యాడ్: బాబు

హైదరాబాద్: రైతులందరికీ త్వరలో ఐప్యాడ్‌లు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. భూసార పరీక్షలు, సాగుయోగ్యమైన పంటల నిర్ధారణ, మేలైన విత్తనాలు, ఎరువులు, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు ఉపగ్రహ సమాచారం అందుబాటులోకి తెచ్చేందుకు ఐప్యాడ్‌లను అందించాలనుకుంటున్నామన్నారు. త్వరలోనే ‘పొలం పిలుస్తోంది’ పేరుతో ప్రత్యేక కార్యక్ర మాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రుణమాఫీపై తనను అభినందించేందుకు వచ్చిన రైతు సంఘాల నేతలనుద్దేశించి మంగళవారం బాబు ప్రసంగించారు.
 

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

మరిన్ని వార్తలు