కడప: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఝులక్ ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులతో చంద్రబాబు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ కు ఆయన ఝులక్ ఇచ్చారు.
ఢిల్లీలో ఉంటున్నావా, గ్రామాల్లో ఉంటున్నావా అంటూ రమేశ్ ను ప్రశ్నించారు. సొంత జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోతే ఓట్లు ఎలా వస్తాయంటూ నిలదీశారు. అధికారుల సమక్షంలో అధినేత ఒక్కసారిగా నిలదీయడంతో సీఎం రమేశ్ అవాక్కయ్యారు.