'శ్వేతపత్రం కాదు అబద్ధాల పత్రం'

30 Nov, 2015 18:38 IST|Sakshi

విశాఖపట్నం: బాక్సైట్‌పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పత్రమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. ఆదివాసీల భూములను వేరొకరికి ఇచ్చే హక్కు ఎవరికి లేదన్నారు. కేంద్రంలో పెద్దన్న మోదీ, రాష్ట్రంలో చిన్నతమ్ముడు చంద్రబాబు ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా చింతపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు