ఒకే కార్యక్రమంలో చంద్రబాబు, పవన్‌

22 Jun, 2018 14:07 IST|Sakshi
పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో శ్రీ భూసేమత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. గణపతి సచ్చిదానంద స్వామిజీ  చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఏకశిలా విగ్రహంలో ఏకాదశ రూపాలు కలిగిన 11 అడుగుల ఎత్తున్న వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్వామివారకి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

విగ్రహ ప్రతిష్ట సందర్బంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత తొలిసారి వీరిద్దరూ ఎదురుపడటంతో ఏం మాట్లాడుకున్నారన్న ఆసక్తి అంతటా నెలకొంది. చంద్రబాబు, పవన్ రాకతో వారిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

మరిన్ని వార్తలు