అభయ కేసులో డ్రైవర్ తో సహా మరోవ్యక్తిపై ఛార్జిషీటు దాఖలు

17 Jan, 2014 15:33 IST|Sakshi

హైదరాబాద్:రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన అభయ కేసులో ఛార్జిషీటు దాఖలైంది.ఈ కేసులో డ్రైవర్ వెంకటేష్ తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. అక్టోబర్ 18న ఓ యువతి షాపింగ్‌మాల్ నుంచి హాస్టల్‌కు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కగా ఆమెను కిడ్నాప్ చేసి కారు డ్రైవర్ సతీష్, సహచరుడు వెంకటేశ్వర్లు అత్యాచారానికి పాల్పడిన సంగతి విదితమే. ఈ ఘటనపై 48 పేజీల ఛార్జీషీటును మాదాపూర్ పోలీసులు మియాపూర్ కోర్టులో దాఖలు చేశారు. గ్యాంగ్‌రేప్ సంఘటనలో నిందితులకు త్వరగా శిక్షలు ఖరారు చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు