ఓటు చెక్‌ చేసుకోం‍డి.. ఈ రోజే చివరి గడువు

15 Mar, 2019 11:26 IST|Sakshi

     సాక్షి, పశ్చిమ గోదావరి:  

  • నేషనల్‌ ఓటర్‌ సర్వీసు పోర్టల్‌ www.nvsp.in ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటరు ఐడీ కార్డు ఎంపిక్‌ నంబరు కానీ నమోదు చేస్తే... ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 
  • 1950 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
  • www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే Search Your Name పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటు ఉందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. 
  • జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబరు వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. 
  • మీ–సేవా కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. 
  • గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెక్‌ యువర్‌ ఓటు పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరి చూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే వినియోగించుకోవచ్చు. 
  • ఓటు నమోదుకు ఈనెల 15 వరకూ అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.  
మరిన్ని వార్తలు