విజయనగరం ఇండస్ట్రీయల్‌ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం

14 Jun, 2019 12:46 IST|Sakshi

సాక్షి, విజయనగరం : జిల్లాలోని బొబ్బిలి ఇండస్ట్రీయల్‌ గ్రోత్‌ ఏరియాలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని బాలీజీ కెమికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీలో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిని జగదీష్‌(35), పలాంటి సురేష్‌(30)గా గుర్తించారు. క్షతగాత్రులను బొబ్బిలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఫ్యాక్టరిలోని బాయిలర్‌ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు