బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయడం హర్షనీయం

26 Jun, 2019 19:46 IST|Sakshi

ఎమ్మెల్యే  చెట్టి ఫాల్గుణ

సాక్షి, అరకు : బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని, వారు జీవితాంతం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరకు లోయలో సంబరాలు నిర్వహించిన అనంతరం స్థానిక గిరిజనులతో కలిసి వైఎస్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అశోక్‌, సుబ్రమణ్యం,భాస్కర్‌, చిన్నారావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు