హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ తో పోల్చుకుంటే ఏపీ బడ్జెట్ లో కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. అన్ని కీలక రంగాలకు నామమాత్రపు కేటాయింపులు జరిపారని అన్నారు. ఇదేం బడ్జెట్ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుద్యోగ భృతి, అంగవాడీల జీతాల పెంపు వంటి అంశాలను ప్రస్తావించలేదన్నారు. రాజధాని నిర్మాణానికి కూడా నామమాత్రం కేటాయింపులు జరిపారు. సంక్షేమ రంగాలకు భారీగా కోత పెట్టారని ఆరోపించారు. యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నివర్గాలను మోసం చేసేలా ఉందని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు.