-

జాబు ఏది బాబూ?

29 Jul, 2015 00:33 IST|Sakshi

విజయనగరంఫోర్ట్: అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి జాబు ఇస్తానని చెప్పిన  ముఖ్యమంత్రి చంద్రబాబూ జాబు ఏదంంటూ లఘు చిత్ర దర్శికుడు బీఏ.నారాయణ ప్రశ్నించారు. చంద్రబాబును ప్రశ్నిస్తూ పోస్టుకార్డు ఉద్యమాన్ని మంగళవారం జొన్న వలసగ్రామంలో చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక నిరుద్యోగి ముఖ్యమంత్రికి బాబు జాబు ఏదంటూ పోస్టు కార్డు పంపించాలని కోరారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినా ఒక ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన కూడా  ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరి నిరుద్యోగుల వయోపరిమితిని 33 ఏళ్ల  నుంచి 44 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. లక్షలాది  ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదన్నారు. ప్రభుత్వం నియమాకాలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగులు రమేష్‌బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు