‘చంద్రబాబు సింగపూర్ ఏజెంట్’

7 Jan, 2015 01:06 IST|Sakshi
‘చంద్రబాబు సింగపూర్ ఏజెంట్’

మలికిపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సింగపూర్ ఏజెంట్‌గా అవతారమెత్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య పేర్కొన్నారు. మంగళవారం మలికిపురంలో జరిగిన సీపీఐ రాజోలు ఏరియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు తక్షణం నిర్మించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అంశంలో బాబు రైతులను, డ్వాక్రా మహిళలను దారుణంగా మోసగించారన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో మలికిపురంలో నిర్వహిస్తామన్నారు. మీసాల సత్యనారాయణ, దేవ ముసలయ్య. కె.మధు, కేశవశెట్టి, దేవ రాజేంద్ర  ప్రసాద్, పంపన ప్రసాదరావు, గెడ్డం ప్రభాకరరావు, కొండా సత్తిబాబు, పిచ్చిక గంగాధరరావు పాల్గొన్నారు. ఆహ్వాన కమిటీ ఏర్పాటు : మలికిపురంలో జరిగే సీపీఐ రాష్ట్ర మహా సభల ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షులుగా దేవ ముసలయ్య, అధ్యక్షులుగా చెల్లుబోయిన కేశవశెట్టి, కార్యదర్శిగా దేవ రాజేంద్రప్రసాద్, సభ్యులను ఎన్నకున్నారు.
 

మరిన్ని వార్తలు