ఇచ్ఛాపురంలో బాల బాహుబలి!

16 Jul, 2017 06:10 IST|Sakshi
ఇచ్ఛాపురంలో బాల బాహుబలి!

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పట్టణంలోని మహాలక్ష్మి ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఐదు కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు. చిన్నాకుల వీధికి చెందిన తండా రాజేష్, జ్యోత్స్న దంపతులకు ఈ చిన్నారి జన్మించినట్లు వైద్యులు కోదండరామ్‌ తెలిపారు. తల్లీబిడ్డ  క్షేమంగా ఉన్నారన్నారు. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు మూడున్నర కేజీలుంటే ఆశ్చర్యపోతారు. అలాంటింది ఐదు కిలోల బరువున్న బాలుడు జన్మించిన ట్టు తెలుసుకున్న స్థానికలు ఈ ‘బాల బాహుబలి’ని చూసేందుకు  ఆసక్తి చూపారు.

మరిన్ని వార్తలు