గుంతకల్: అనంతపురం జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది. పాఠశాల గేటు విరిగిపడి ఓ చిన్నారి మృతిచెందిన సంఘటన జిల్లాలోని గుంతకల్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల గేటు విరిగిపడి నర్సరీ విద్యార్థి రవి మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.