బోరుబావిలో పడి బాలుడు మృతి

24 Aug, 2013 09:08 IST|Sakshi

ఆలూరు మండలం హులేబేడులో గతరాత్రి బోరుబావిలో పడిన బాలుడు మృతదేహన్ని రెస్క్యూటీమ్ శనివారం వెలికి తీసింది. హులేబేడులో శుక్రవారం రాత్రి అడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ను పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలించారు. రెస్క్యూ టీమ్ గతరాత్రి నుంచి కృషి చేసి బాలుడి మృతదేహన్ని శనివారం ఉదయం బోరుబావి నుంచి వెలికితీసింది.

 

అలాగే చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  
 

మరిన్ని వార్తలు