బాల్య వివాహం నిలిపివేత

7 Jun, 2015 23:52 IST|Sakshi

 వేపాడ:  జాకేరు గ్రా మంలో బాల్య వివాహం జరగకుండా జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు అడ్డుకున్నారు. వల్లంపూడికి చెందిన బాలికను జాకేరుకు చెందిన యువకునిచ్చి ఆదివారం వివాహం చేస్తున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీకి సమాచారం అందింది. పీడీ ఆదేశాలతో రెండు కుటుంబాలకు జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి బి.హెచ్.లక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది నాగరాజు, చిట్టిబాబు, కౌన్సిలర్ సంధ్య కౌన్సిలింగ్ నిర్వహించి వివాహాన్ని నిలుపు చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ పి.ఆదిలక్ష్మి, ఏఎస్‌ఐ మల్లేశ్వర్రావు, సర్పంచ్ బుద్దా అప్పలనాయుడు, దళిత నేత జేసుదాసు, ఐసీడీఎస్ పీవో ఆర్.ఉషారాణి, సూపర్‌వైజర్ వెనీసాసుందరి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు