శ్రీవారిని దర్శించుకున్న ‘మెగా’ కుటుంబం

10 Mar, 2017 20:25 IST|Sakshi
శ్రీవారిని దర్శించుకున్న ‘మెగా’ కుటుంబం

తిరుమల: సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుటుంబ సభ్యులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తల్లి అంజనాదేవి, చెల్లెళ్లు విజయదుర్గ, మాధవిలు వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి బోర్డు సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్‌ ప్రత్యేక దర్శనం కల్పించి ప్రసాదాలు అందజేశారు.

 

మరిన్ని వార్తలు