మధురపూడి, న్యూస్లైన్ : రాజమండ్రిలో జరిగే రెండు శుభకార్యాలకు హాజరయ్యేందుకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బుధవారం సాయంత్రం 4 గంటలకు మధురపూడి చేరుకున్న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి కొంతసేపు విమానాశ్రయంలోనే నిలిచిపోవలసి వచ్చింది.
చిరంజీవి కన్నా ముందు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మధురపూడి చేరుకుని రాజమండ్రి బయల్దేరారు. ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చిన వేలాది మంది అభిమానులు, ప్రజల వాహనాలతో మధురపూడి-రాజమండ్రి రోడ్డు కిక్కిరిసి ఉన్నందున పోలీసుల సూచన మేరకు చిరంజీవి 40 నిమిషాలపాటు విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లో గడిపారు.