సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ శనివారం సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వక భేటీ జరిగింది. అనంతరం చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ.. త్వరలోనే ముఖ్యమంత్రితో మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు.