విశాఖ ఐఐఎంలో తరగతులు ప్రారంభం

21 Sep, 2015 13:49 IST|Sakshi

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు వీటిని అధికారికంగా ప్రారంభించారు. విభజన చట్టంలో హామీ మేరకు ఇక్కడ ఐఐఎంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బెంగళూరు ఐఐఎం డెరైక్టర్ సుశీల్ వశాని తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు