సీఎం వ్యాఖ్యలపై న్యాయపోరాటం

10 Feb, 2016 02:23 IST|Sakshi
సీఎం వ్యాఖ్యలపై న్యాయపోరాటం

 పుంగనూరు : ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబునాయుడు దళితులను అవమానపరిచేలా మాట్లాడడం సరికాదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, దళిత నేత ఎన్.రెడ్డెప్ప స్పష్టం చేశారు. హైకోర్టులో కేసు దాఖలు చేస్తామన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ‘దళితులుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు’ అంటూ మాట్లాడడం వారి మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అన్నారు. సమాజంలో దళితులు దుర్భరజీవితం గడుపుతున్నారని, వారిని ఆదుకోవాల్సింది పోయి అవహేళన చేయడం శోచనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ కులాలను అవమానపరచినా సహించేది లేదని ఈ సంద ర్భంగా రెడ్డెప్ప హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీపీలు నరసింహులు, అంజిబాబు, కౌన్సిలర్ మనోహర్, దళిత నాయకులు సురేష్, రమణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు