విద్యార్థుల మృతదేహాలను రప్పించండి

16 Apr, 2020 17:41 IST|Sakshi

అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు

ప్రక్రియను వేగవంతం చేసిన అధికారులు

సాక్షి, అమరావతి: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు కేపీ వంశీ, రేవంత్‌కుమార్‌ మృతదేహాలను ఏపీకి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఖర్చుకు వెనకాడవద్దని సీఎం స్పష్టం చేశారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ కూడా రాశారు.

మరిన్ని వార్తలు