మీ త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరవదు: వైఎస్‌ జగన్‌

26 Jul, 2019 14:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లేక్కచేయకుండా  కార్గిల్‌ యుద్ధంలో అసువులు బాసి విజయాన్నందించిన జవాన్లకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఘననివాళులు అర్పించారు. ‘కార్గిల్‌ విజయ్ దివస్’ సందర్భంగా ఆయన ట్విటర్‌ వేదికగా వారి త్యాగాలను, ధైర్యసాహసాలను ఈ దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు.

‘దేశ రక్షణ కోసం ప్రాణాలు వదిలి మమ్మల్ని  గెలిపించిన అమరజవాన్లకు నివాళులు.. కృతజ్ఞతలు. వారి ధైర్య సాహసాలు, త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.  20 ఏళ్ల క్రితం కార్గిల్‌ను ఆక్రమించుకోవడానికి దాయాదీ పాకిస్తాన్‌ పన్నిన కుతంత్రాన్ని తిప్పికొడుతూ...  మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. నాటి  కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు