సీఎం పర్యటన ఖరారు

22 Apr, 2016 00:49 IST|Sakshi
సీఎం పర్యటన ఖరారు

ఏలూరు (మెట్రో) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పర్యటన ఖరారైంది. ఈనెల 23న ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా దేవరపల్లి జెడ్పీ హైస్కూల్‌కు చేరుకుంటారు. అనంతరం దేవరపల్లిలో పోలవరం ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ ప్యాకేజీ-2 పనులను  పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు దేవరపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు పెదవేగి మండలం ముండూరు గ్రా మానికి చేరుకుంటారు.
 
  జిల్లాలో 500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించినందుకు గుర్తుగా ముం డూరులో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం గుండేరు పనుల తీరును పరి శీలిస్తారు. అక్కడి నుంచి జానంపేట అక్విడెక్ట్ వరకూ కాలువ నిర్మాణ పనులను పరిశీలి స్తారు. మధ్యాహ్నం 2.50 గంటలకు జానంపేట నుంచి బయలుదేరి దొండపాడులోని వంగూరు బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 4.50 గంటల వరకూ నీరు-చెట్టు పథకం పై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. 4.50 గంట లకు వంగూరు బైపాస్ రోడ్డు నుంచి బయలుదేరి 5 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో  విజయవాడ వెళతారు.
 

మరిన్ని వార్తలు