సాయిప్రణీత్‌కు సీఎం జగన్‌ అభినందనలు

29 Aug, 2019 22:03 IST|Sakshi

సాక్షి, అమరావతి : అర్జున అవార్డు గ్రహిత సాయిప్రణీత్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక అర్జున అవార్డును సాధించడం తెలుగు రాష్ట్రాలకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. కాగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సాయిప్రణీత్‌ అర్జున అవార్డును అందుకున్నారు.

(చదవండి : ఒలంపిక్స్‌లో పతకంమే నా లక్ష్యం : సాయిప్రణీత్‌)

రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగిన ఈ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ అవార్డులను అందజేశారు. 

(చదవండి : రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానం)   

మరిన్ని వార్తలు