మహిళా కమిషన్‌ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్‌

16 Dec, 2019 20:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆవిష్కరించారు. సోమవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ ఛైర్‌ పర్సన్‌ ఆర్‌కే రోజా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు