అంబేడ్కర్‌కు సముచిత గౌరవం

9 Jul, 2020 04:04 IST|Sakshi

బెజవాడ నడిబొడ్డున స్వరాజ్‌ మైదానంలో 125 అడుగుల భారీ విగ్రహం  

శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

20 ఎకరాల్లో విగ్రహంతో పాటు పార్కు, స్మారక మందిరం, గ్రంథాలయం, వాకింగ్‌ ట్రాక్‌.. ఏపీఐఐసీకి పనుల అప్పగింత  

సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తిని కలిగించేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల నిలువెత్తు విగ్రహ ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చారిత్రక ఘట్టానికి విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌ వేదిక కానుంది. విగ్రహ ఏర్పాటుతో పాటు పార్కు తదితర నిర్మాణ పనులకు బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అంబేడ్కర్‌ పార్క్‌కు వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేసి మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

► విజయవాడ నగరం నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేస్తే అంబేడ్కర్‌కు తగిన గౌరవం ఇచ్చినట్టు అవుతుందని, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.


అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌గా నామకరణం
► నీటిపారుదల శాఖకు చెందిన 20.22 ఎకరాల విస్తీర్ణంలో పీడబ్ల్యూడీ మైదానం ఉంది. 
► విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1997లో దీని పేరు ‘స్వరాజ్‌ మైదాన్‌’గా మార్చింది. 
► ఇప్పుడు ఈ మైదానానికే ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌’గా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నామకరణం చేసింది. 
► ఏడాదిలోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విగ్రహ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ఏపీఐఐసీకి అప్పగించింది. 
► 20 ఎకరాల స్థలంలో అంబేడ్కర్‌ స్మారక మందిరంతో పాటు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే విగ్రహం చుట్టూ ఆహ్లాదకరమైన (పార్కు), ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌తోపాటు వాకింగ్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు. 

మరిన్ని వార్తలు