కరోనా వ్యాప్తిపై సీఎం జగన్‌ సమీక్ష

22 Mar, 2020 15:15 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ వ్యాప్తిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఆళ్లనాని, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్నిలు పాల్గొన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాజిటివ్‌ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్‌పై ఈ సాయంత్రం 5 గంటలకు మీడియాతో సీఎం జగన్‌ మాట్లాడనున్నారు. జనతా కర్ఫ్యూ పై ప్రజల అపూర్వ స్పందన, కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడతారు.

చదవండి : అప్రమత్తంగా ఉందాం 

మరిన్ని వార్తలు