అబ్దుల్‌ కలాంకు సీఎం జగన్‌ నివాళి

27 Jul, 2019 12:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : దివంగత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్‌ మ్యాన్‌ డాక్టర్‌ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. భారత శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆయన కృషి మరువలేనిదని అన్నారు. కలాం నడిచిన బాట, ఆయన పద్ధతులు లక్షలాదిమందికి స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం బోధనలు ఇప్పటికి కూడా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు