తాడేపల్లికి బయల్దేరిన సీఎం జగన్‌

5 Aug, 2019 11:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనను ముగించుకుని సోమవారం రాష్ట్రానికి తిరిగివచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా ఈ నెల 1వ తేదీ రాత్రి కుటుంబసభ్యులతో కలసి సీఎం ఇజ్రాయెల్‌కు వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లికి బయల్దేరారు.

మరిన్ని వార్తలు