సాక్షి, అమరావతి : విశాఖ నగర అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ వినయ్చంద్, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తాగునీరు, రోడ్లు, పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖ మెట్రోపైనా సీఎం సమీక్షించారు. విశాఖలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులో సీఎం చర్చించారు.
ఈ సమావేశంలో చర్చించిన ముఖ్యమైన అంశాలు:
►పోలవరం వద్దే నిటిని ఫిల్టర్ చేసి అక్కడి నుంచి విశాఖకు పంపిణీ చేయాలని సీఎం సూచించారు.
►కెనాల్స్ ద్వారా వస్తున్న నీటిలో చాలా వరకు నీరు వృధా అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ వృధా దాదాపు 40శాతం ఉంటుందని చెప్పారు
►పైపులైన్ ద్వారా తాగునీటి సరఫరా అత్యవసరమని సమావేశంలో చర్చ
►వాటర్ గ్రిడ్లో భాగంగా చేపట్టే ఆలోచనపై సమావేశంలో చర్చ
►పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు తాగునీటి వసతిని కల్పిస్తూ, పరిశ్రమల అవసరాల కోసం డిశాలినేషన్ వాటర్ ప్లాంట్లు
►పరిశ్రమలకు ప్రెష్ వాటర్ కాకుండా డిశాలినేషన్ నీటిని వాడే ఆలోచన చేయాలని సీఎం సూచించారు.దీనికి 1000 లీటర్లకు 57సెంట్స్ అంటే లీటర్కు 4పైససు ఖర్చు అవుతుందని సీఎం జగన్ చెప్పారు
►డీశాలినేషన్ చేసి ఆ నీటిని పరిశ్రమలకు కేటాయించాలని సీఎం సూచించారు
విశాఖ వ్యర్థాల నిర్వాహణపై చర్చ
►కొన్ని సంవత్సరాలుగా డంపింగ్ చేసిన వ్యర్థాల వల్ల కాలుష్యం ఏర్పడకుండా, భూగర్భజలాలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ
►కాపులుప్పాడలోని డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియకు సీఎం నిర్ణయం
►అక్కడున్న డంపింగ్యార్డులో క్రమేణా బయోమైనింగ్ చేయడం ద్వారా కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయం
►విశాఖపట్నంలో రోడ్లు అన్నింటినీ బాగు చేయాలని సీఎం ఆదేశం
►దీనికి సంబంధించిన ప్లాన్ను తయారు చేస్తున్నామన్న అధికారులు
►నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్డ్రైనేజీ ఏర్పాటుకూ చర్యలు తీసుకోవాలన్న సీఎం
బీచ్రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం
►బీచ్రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియంపై అధికారులకు సీఎం సూచనలు
►నిర్మాణశైలిలో మార్పులు సూచించిన సీఎం
►సబ్మెరైన్ మ్యూజియం, ఫుడ్ కోర్టుల ఏర్పాట్లను వివరించిన అధికారులు
►కైలాసగిరిలో ప్లానెటోరియంపైన వివరాలు అందించిన అధికారులు
►త్వరలో పనులు చేపట్టాలన్న సీఎం
విశాఖపట్నం మెట్రోరైల్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
►10 విడతలు, 10 కారిడార్లు
►మెట్రోరైల్ మొత్తం మార్గం 140.13 కి.మీ.
►ఫస్ట్ ఫేజ్ మొత్తం 46.40 కి.మీ
►స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది 34.23 కి.మీ
►గురుద్వార – ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ 5.26
►తాడిచెట్ల పాలెం నుంచి ఆర్కే బీచ్ 6.91 కి.మీ
►2020 –2024 మధ్య పూర్తిచేయాలని ప్రతిపాదన